కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 28 : మంథని నియోజకవర్గం పరిధిలోని కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోల్లపెల్లి తిరుపతి గౌడ్, మాజీ గౌడ సంఘం అధ్యక్షుడు బోల్లపెల్లి కొమురయ్య , గౌడ సంఘం అధ్యక్షుడు బోల్లపేల్లి తిరుపతి గౌడ్, బోల్లపేల్లి రాజయ్య గౌడ్, ఎలవేన లక్ష్మణ్ యాదవ సంఘం నాయకులు, బండి పోశెట్టి ,గడ్డం రాజమహేందర్, ములకలపల్లి గౌడ సంఘం నాయకులు తీగల రాజయ్య, బర్ల నరసయ్య ముదిరాజ్ సంఘం నాయకులు, పడాల రామన్న బోల్లపెల్లి సందీప్ బీఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీని వీడి శనివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఏఐసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మండల కన్వీనర్ ఎస్ఎస్ అన్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ గౌడ్, జిల్లా కార్యదర్శి భూంపల్లి రాజయ్య, సింగిల్ విండో చైర్మన్ ఇనుగంటి భాస్కరరావు, ఎంపీటీసీ శివ శంకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జెమినీ గౌడ్, ముత్యం తిరుపతి గౌడ్, గడ్డం బాపు గౌడ్, కుక్క రవి, ఇక్బాల్, రాజ్ రెబల్, పెండ్యాల రాజు, లల్లు తదితరులు పాల్గొన్నారు.