కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

మోత్కూరు జూలై   జనంసాక్షి : మాజీమంత్రి టీపీసీసీ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక మున్సిపల్ కేంద్రంలో నల్ల బెలున్ లను ఎగరేస్తూ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ పై ఈడీతో ప్రతిపక్షం పై అక్రమకేసులు పెడుతూ కక్షసాధింపు చర్యలు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండగొని రామచంద్ర, కాంగ్రెస్ నాయకులు అవిషెట్టి అవిలిమల్లు, నాయిని ప్రవీణ్, పురుగుల నర్సింహ,గుండు శ్రీను,మందుల సురేష్,కారుపొతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.