కాంగ్రెస్ లో చేరిన మహదేవ్ పూర్ సింగిల్ విండో చైర్మన్ దంపతులు

కాంగ్రెస్ లో చేరిన మహదేవ్ పూర్ సింగిల్ విండో చైర్మన్ దంపతులు

జనంసాక్షి, మంథని, నవంబర్ 4 : అసెంబ్లీ ఎన్నికల బిఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మంథనిలో ఏఐసీసీ సెక్రెటరీ,మాజీ మంత్రి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో మాజీ జెడ్పీటీసీ, మహాదేవపూర్ పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి, ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ చల్లా రమ శనివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.