కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన ఎస్‌ఐ కారు

చిత్తూరు,జూలై28(జనంసాక్షి ): కుప్పంలో ఓ కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ కారు దూసుకెళ్లింది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హెల్మెట్‌ అవగాహన కార్యక్రమం చేపడుతున్న సమయంలో ప్రమాదవాత్తూ కారు ముందుకెళ్లడంతో ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శివరాజ్‌ అనే కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవింగ్‌ అవగాహన లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. గాయపడిన కానిస్టేబుల్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.