కారు ప్రచార హోరు- ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన పోచారం సురేందర్ రెడ్డి.

కారు ప్రచార హోరు- ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన పోచారం సురేందర్ రెడ్డి

కోటగిరి నవంబర్ 8 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డినీ మరో మారు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గం ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి అన్నారు.బుధవారం కోటగిరి మండల కేంద్రంలోనీ ఎస్సీ కాలనీలో ఆయన స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై సర్వే నిర్వహించి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటింటికీ అందిస్తూ అలాగే ప్రజల సమస్యలను ఎల్లవేళలా సమీక్షించి సమస్యలను పరిష్కరిస్తూన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం,పోచారం శ్రీనివాస రెడ్డి ఎల్లవేళలా తోడుగా ఉంటారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కోట గిరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కులకర్ణి అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హమీద్,సింగిల్ విండో చైర్మన్ కూచి సిద్దు,ఉప సర్పంచ్ నిలోఫర్ ఫాతిమా హర్షద్, మండల రైతు బంధు అధ్యక్షులు కొల్లూరు కిషోర్ బాబు,నాయకులు హౌగిర్ రావు పటేల్,బంర్ల మధు,కన్నం సాయిలు,కూచి సాయి బాబా, బీర్కూర్ సంతోష్,బ్యాగరి రాములు,దేవుడు సాయిలు, పోమ్మడి గంగాధర్,జుబేర్, జమీర్,ధూమ్ కలీం,దినేష్, కుమ్మరి హన్మండ్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.