కార్మికుల సంక్షేమ మే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతాం;ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ టౌన్ నవంబర్ 16 ( జనంసాక్షి )
కార్మికుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హమాలీ కార్మికులు టిఆర్.ఎస్ కెవి లో చేరారు.వారికి ఎమ్మెల్యే గారు కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు.ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత పాలకుల కాలంలో కార్మికుల జీవన పరిస్థితి దుబ్బరంగా మారిందన్నారు.తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, వృత్తిపరంగా తోడ్పాటును అందిస్తున్నామన్నారు. కార్మికులకు భీమా అందిస్తూ కార్మికుల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు టిఆర్ఎస్కెవి యూనియన్ రాష్ట్రంలోని అతిపెద్ద కార్మిక సంఘం అన్నారు టిఆర్ఎస్కెవి సంఘాన్ని  మరింత బలోపేతం చేయాలన్నారు పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.  పార్టీలో చేరిన వారు ముదిరెడ్డి నాగిరెడ్డి, ఉల్లెందుల రమణ,పందిపోటు శ్రీకాంత్, గూడెపు వీరబాబు,నాగయ్య,బాబు, తొగరు మధు, శివ, సత్యం, గంగవరపు నరసింహారావు, తదితరులు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్మిక విభాగం  జిల్లా నాయకులు  పచ్చిపాల ఉపేందర్,మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,పట్న పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు,పట్టణ కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.