కాలుష్యమే అసలు సమస్య: జోగురామన్న

న్యూఢిల్లీ,జూన్‌5(జనం సాక్షి ): కాలుష్యం కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని మంత్రి జోగురామన్న అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా జోగురామన్న ఢిల్లీలో పర్యావరణ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ..కాలుష్య కారకాల నియంత్రణకు కార్యాచరణపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్‌, బయోమెడికల్‌, సాలిడ్‌ వ్యర్థాల మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించామని అన్నారు. పర్యావరణ సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా ఉన్నారని అన్నారు.