కాల్పుల్లో ధనుష్‌ అభిమాని మృతి: సంతాపం తెలిపిన నటుడు

చెన్నై,మే25(జ‌నంసాక్షి): తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఆందోళనకారులపై పోలీసులు జరిపిన తుపాకీ కాల్పుల్లోనటుడు  ధనుష్‌ అభిమాని కూడా ఉన్నారు. అతని మృతి వార్త తెలుసుకుని ధనుష్‌ సంతాపం తెలిపారు. ఈ కాల్పుల్లో 13 మంది మరణించిన విషయం తెలిసిందే. వారిలో ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ స్టంట్‌ సిల్వ సవిూప బంధువు ఒకరు, ధనుష్‌ అభిమాని ఒకరు ఉన్నారు. తన అభిమాని మృతిపై ధనుష్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ఓ సందేశం ఉంచారు. తుపాకీ కాల్పుల్లో నా అభిమాన సంఘానికి చెందిన తమ్ముడు ఎస్‌.రఘు అలియాస్‌ కాళియప్పన్‌ మరణించిన విషయం తెలిసి తీవ్ర దిగ్భాంతికి గురయ్యా. అతడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కాళియప్పన్‌ కుటుంబీకులను కలుస్తా. తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని ధనుష్‌ పేర్కొన్నారు.