కాళోజి జయంతి వేడుకలు..

 

ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకట్రాం నర్సయ్య ఆధ్వర్యంలో

 

కేసముద్రం సెప్టెంబర్ 9 జనం సాక్షి /శుక్రవారం ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా జడ్పీహెచ్ఎస్ కల్వల పాఠశాలలో ‘తెలంగాణ భాషా దినోత్సవం’ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకట్రాం నర్సయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు కాళోజి యొక్క సాహితీ సంపత్తిని,తొలి మలి దశలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అతని పాత్రను, తెలంగాణ భాష సాహిత్యానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రోజా రాణి, రత్నమాల, సమ్మి రెడ్డి శ్రీనివాస్ బిక్షపతి, డీకే వెంకటేశ్వర్లు, ఏ వెంకటేశ్వర్లు, బలరాం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.