కిడ్నీ బాధితునికి అండగా నిలిచిన దాతలు,మార్నింగ్ వాకర్స్

మల్దకల్ జులై 27 (జనంసాక్షి) కిడ్నీల సమస్యతో బాధపడుతున్న మల్దకల్ మండల కేంద్రానికి చెందిన పూజారి నరసింహులు కుటుంబానికి మల్దకల్ మార్నింగ్ వర్కర్స్ తన వంతు సహాయంగా 16100 వేల ఒక వంద రూపాయలు అందజేసి వాళ్ళ ఉదార భావాన్ని చాటుకున్నారు.బుధవారం గట్టు జడ్పిటిసి బాసు శ్యామల,మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనుమంతు 10000 ఆర్థిక సాయం అందజేశారు. పాల్వాయి శ్రీరామ సైన్యం 10000 వడ్డేపల్లి జెడ్పిటిసి రాజు 2000, రాజశేఖర్ 3000, నక్క తిరుమలేష్ 3000, జయ కృష్ణ 3000, ఉదయ్ గౌడు 2000, కేబీ ఆంజనేయులు 1000,ఉప్పరి నర్సింలు వెయ్యి, సంజీవ2000, చంద్ర శేఖరు 500, భీముడు 500, వెంకటేష్ 500, మల్దకల్ గ్రామానికి చెందిన మార్నింగ్ వాకర్స్ ఆ కుటుంబానికి సాయం చేయాలని,కోరుచున్నారు.ఆ కుటుంబానికి సాయం చేసిన అందరికీ కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్నింగ్ వాకర్సు ఆర్ఎంపీ డాక్టర్స్ భీష్మ చారి,రాజు,బిటి నాయుడు,ఎల్ఐసి మల్దకల్, దామ భీమరాయుడు ,మెడికల్ రాజు, టీచర్ మునేప్ప, మనోహర్,రాఘవేందర్ గౌడ్, క్యామ,ఆశన్న, బలిజ బాచి,నరేందర్ గౌడ్, కంసాలి కృష్ణ ,కోమటి నరసింహయ్య, ఫర్టిలైజర్ గోవర్ధన్ ,ముర్రి తిమ్మప్ప, తిరుమలేష్ ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.