కిపిల్ మిశ్రాకు బిజెపి తలుపులు తెరిచాం: విజయ్ గోయల్
న్యూఢిల్లీ,జూన్4(జనం సాక్షి): ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించి అనంతరం ఆప్కు రెబల్గా మారిన శాసనసభ్యుడు కపిల్ మిశ్రాను బిజెపి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మంత్రి విజయ్ గోయల్ పేర్కొన్నారు. ‘అతని కోసం తలుపులు తెరిచే ఉంటాయని’ బిజెపి ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమం’ సంపర్క్ ఫర్ సమర్థన్’ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అతని నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆప్లో చేరకముందు నుండే కపిల్ తెలుసునని, మిశ్రా మంచి సామాజిక కార్యకర్తని ప్రశంసించారు. ఆయన లాంటి స్నేహితులు తమకు అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మరొక మంత్రిని లక్ష్యంగా చేసుకొని వారు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు చేయడంతో గత సంవత్సరం మాజీ నీటి వనరుల మంత్రి కపిల్ శర్మను పార్టీ నుండి బహిష్కరించారు. అనంతరం నాన్ఫెర్మామెన్స్కు కింద మంత్రి పదవి నుండి తొలగించిన సంగతి తెలిసిందే.