*కుటుంబం సమేతంగా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ఆర్డీఓ రాములు .

 అలంపూర్ జులై 6  (జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను బుధవారం గద్వాల్ ఆర్డీఓ రాములు కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు . ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి పురేందర్,వేదపండితులు ఆనందశర్మలు స్వాగతం పలికారు, అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాలువాతో సత్కరించి, ఆలయ ప్రతిష్టతను  వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు.