కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య యత్నం

 

తల్లి తోపాటు పిల్లలను కాపాడిన పోలీసులు

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 19 భర్త వేధింపులు తాళలేక కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని బీచుపల్లి కృష్ణానది దగ్గర సోమవారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై గోకారి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మల్డకల్ మండల పరిధిలోని కుర్తిరావుల చెరువు గ్రామానికి చెందిన కె. సురేఖ అనే మహిళ తన భర్త కె. శ్రీకృష్ణ వేదింపులకు గురి చేస్తున్నడంతో ఇద్దరు పిల్లలతో కలిసి బీచుపల్లి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండగా గమనించిన పోలీసులు సురేఖను జగన్, జై లను కాపాడినట్లు ఆయన తెలిపారు. అనంతరం భర్త శ్రీకృష్ణకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న శ్రీకృష్ణకు , భార్య సురేఖకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగిందన్నారు. సురేఖ, ఇద్దరు చిన్నారులను కాపాడిన పోలీస్ సిబ్బందిని ఎస్సై గోకారి అభినందించారు.