కుమార్ కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త తొర్ర విష్ణు

ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 24 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో అనారోగ్యంతో ఇటీవల మరణించిన ఇందిరానగర్ కాలనీకి చెందిన మారబోయిన కుమార్ గారి కుటుంబానికి ప్రముఖ పారిశ్రామికవేత్త సరస్వతీ విద్యాలయం కరస్పాండెంట్ తొర్ర విష్ణు నిత్యావసర వస్తువులు అందజేశారు ఈ సందర్భంగా తొర్ర విష్ణు మాట్లాడుతూ మృతి చెందిన కుమార్ కుటుంబ సభ్యులకు మనో ధైర్యం చెప్పి కుమార్ మన మధ్యన లేకున్నా నా వంతు సహాయ సహకారాలు మీ కుటుంబానికి అందిస్తానని అన్నారు మా కుటుంబానికి అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సరస్వతీ విద్యాలయం ప్రిన్సిపాల్ పంజాల నర్సయ్య ఐలయ్య సుధాకర్ బాలకృష్ణ లలిత సంతోష సంధ్య మాధవి నవ్య సోనీ ఆదర్శ అఖిల తదితరులు పాల్గొన్నారు