కూకట్ పల్లిలో పోలింగ్ కేంద్రంలో ఓటర్ల నిరాశ..

 హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కూకట్ పల్లిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు ఎలాంటి అవగాహన కల్పించలేదన్నారు. ఎన్నికల సంఘం సూచించిన తొమ్మిది ధృవీకరపత్రాలలో ఓటర్ ఐడెంటీడీ కార్డు ఉందని, కానీ ఇక్కడ ఆధార్ కార్డు తీసుకరావాలని చెబుతున్నారని పేర్కొన్నారు. దీనిపై తాను న్యాయపరమైన పోరాటం చేస్తానని ఓటర్ పేర్కొన్నారు. పది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల పేర్లు ఈ కేంద్రంలో నమోదు కావడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. సరూర్ నగర్, బాలానగర్ తదితర దూర ప్రాంతాలకు చెందిన ఓటర్ల పేర్లు ఇక్కడ నమోదయ్యాయని పేర్కొన్నారు.