కూకట్‌ పల్లి బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అభ్యర్థి బండి రమేష్ సమక్షంలో సాధు ప్రతాపరెడ్డి చేరిక

సికింద్రాబాద్ నవంబర్ 23 ( జనం సాక్షి )
కూకట్‌ పల్లి బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్‌ ఇవ్వడంతో ఒక్కొక్కరుగా బీజేపీ నేతలు పక్క పార్టీల వైపుకు వెళుతున్నారు. బీజేపీ సీనియర్ నేత సాధు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోలింగ్‌కు వారం రోజుల ముందు ప్రతాపరెడ్డి తమ పార్టీలో చేరడం కలిసొస్తుందన్నారు. ప్రతాపరెడ్డి రాకను స్వాగతించారు. కూకట్ పల్లి కాంగ్రెస్ లో కి ప్రతాపరెడీ పాటు అనుచరులు బీజేపీ కార్యకర్తలు,కోటేశ్వరరావు,షేక్ బాబు, శంకరయ్య, చలపతరావు,ఇంద్రనాథ్,బషీర్ వేణుగోపాల్, సాగర్,రామనారాయణ,రాజు, సుగుణ చౌదరీ, సైఫలికన్, రమేశ్ రెడ్డి, సంతోష్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,అర్జున్,డేవిడ్, చంద్రయ్య,సత్యనారాయణ,సంజీవ్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీలోకి చేరారు