*కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి*

*రాష్ట్ర గిడ్డంగుల శాఖ  చైర్మన్ సాయి చంద్* *అలంపూర్ జనంసాక్షి* (సెప్టెంబర్ 20 )2023 లో జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ఉండాలని, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్ అన్నారు. మంగళవారం సాయి చందు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, జోగులాంబ అమ్మ వారిని దర్శించుకున్నారు. సోమవారం సాయి చంద్ అభిమానులు అలంపూర్ చౌరస్తా లో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, వాల్ పోస్టర్లు వేశారు. అయితే సాయి చంద్ వాల్ పోస్టర్ లను మంగళవారం నాడు ఉదయం తెల్లారేసరికి గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు  సాయి చందు మాట్లాడుతూ
పోస్టర్లు చించిన దానిపై స్పందిస్తూశుభ దినం రోజున, ఆశుభ మాటలు ఎందుకు అన్నారు.
నా పోస్టర్లు చించితే చించారు కాని,వాటి మీద కెసిఆర్, కేటీఆర్ బొమ్మలే కాక, జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే అబ్రహం ఫోటో కూడా ఉందని మర్చిపోయారు అన్నారు.
దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి కోరారు.
తన టికెట్ పై విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ,  మా నాయకుడు కేసీఆర్ ఆదేశాల మేరకు జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో అదిలాబాద్, అచ్చంపేట, అలంపూర్ నియోజకవర్గాలలో ఎక్కడనుండి ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సాయిచంద్ అన్నారు. నియోజవర్గంలోని టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
Attachments area