కెసిఆర్ సంక్షేమ పథకాలే బి ఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి.

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : తొలుత పట్టణ సాయిబాబా ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం , పట్టణంలో చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ ఎన్8కల ప్రచారం ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం. గడపగడపకు తిరుగుతూ బిఆర్ఎస్ మేనిఫెస్టో కరపత్రం అందిస్తూ, కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. సూపర్ బజార్ ఏరియాలో వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలతో కలిసి ప్రచారం నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుత మందమర్రి , చెన్నూరులో బిఆర్ఎస్ పార్టీకి అపురూపమైన స్పందన ఉందని, అలాగే రామకృష్ణాపూర్ లో కూడా మంచి స్పందన లభిస్తుందన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో సుమారు నాలుగువేల కుటుంబాలు సింగరేణిలో ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న వారికి ఇండ్ల పట్టాలు అందజేసిన బిఆర్ఎస్ పార్టీని రానున్న ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కెసిఆర్ అందజేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని , రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, పట్టణ ఇంచార్జ్ గాండ్ల సమ్మయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు,మహిళా నాయకురాలు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు