కేటీఆర్ జన్మదినం సందర్భంగా దేవాలయంలో పూజలు

మల్దకల్ జులై 24 (జనంసాక్షి) రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అర్చనలు,పూజలు ఆదివారం నిర్వహించారు.ఎంపీపీ రాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం యాచకులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు, వైస్ ఎంపీపీ వీరన్న, సర్పంచ్ యాకోబు,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, చంద్రశేఖర్ రెడ్డి,నరేందర్, మధు,వెంకటేశ్వర్ రెడ్డి ,నరసింహారెడ్డి,వెంకటేశ్వర రెడ్డి, వెంకటన్న,ప్రభాకర్ ,పరుశురాముడు, ఉప్పరి నారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.