కేటీపీపీ రెండో యూనిట్ ప్రారంభం..

6

సీఎం కేసీఆర్ రెండో రోజు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కేటీపీపీ రెండ్ దశ 600 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. విద్యుత్ కేంద్ర పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం ప్లాంట్ ను జాతికి అంకితం చేశారు. కేటీపీపీ మొదటి యూనిట్లో ఇప్పటికే 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. రెండో దశలో నిర్మించిన ఈ ప్లాంట్ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీని నిర్మాణానికి 3వేలా 4వందల కోట్లు ఖర్చైంది.