కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు12(జనంసాక్షి):
జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవడంతో శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కొల్లాపూర్ ఎంఎల్ఏ భీరం హర్షవర్ధన్ రెడ్డి చిత్రపటాల కు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు.విధుల్లోకి తీసుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ గత 29 నెలల నుండి విధుల నుండి పక్కన పెట్టిన ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా గత మూడు నెలల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి విధుల్లో తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు.రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఋణపడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఫీల్డ్ అసిస్టెంట్లు దేవేందర్,ఆంజనేయులు,శ్రీను, సత్యం గౌడ్, భద్రాచలం తదితరులు పాల్గొన్నారు.