కేసీఆర్ సభను విజయవంతం చేయాలి హన్మంత్ షిండే

బిచ్కుంద అక్టోబర్ (28)
ఈ నెల 30న జుక్కల్ లో నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభను విజయవంతం చేయాలని జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ సభ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ గ్రామాలు, మండలాలు, వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రజలను బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించడంతో పాటు సీఎం కేసీఆర్‌ సభకు రావాలని ఆహ్వానించారు. సభ విజయవంతంలో ప్రతి ఒక్కరూ క్రియాశీల పాత్ర పోషించాలన్నారు.