కొండమల్లేపల్లి పట్టణంలో ఘనంగా జాన్ పహాడ్ షాహిద్ సందల్ ఊరేగింపు

న్యూస్: మండల కేంద్రంలో శుక్రవారం నాడు ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో జాన్ పాడ్ షాహీద్ సందల్ ను గుర్రం మీద పట్టణంలో పుర విధులలో యువకులు, మహిళలు భారీ   ఊరేగింపును జరిపారు కోల్ ముంతల్ పహాడ్  గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జాన్ పహాడ్ షాహిద్ దర్గాలో సందల్ ను సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి  సంవత్సరం గార్మి చేసి సందల్  ఊరేగింపు చేసి దర్గాల్లో సమర్పిస్తారు అనంతరం భక్తులు కులమతాలకు జాతులకు అతీతంగా జాన్ పహాడ్ షాహిద్ దర్గాలో చాదర్ సమర్పించి మొక్కులు చేస్తారు  ఖవాలితో పాటు  దర్గా ప్రాంగణం జనాలతో నిండిపోతుందని తెలిపారు ఖవ్వాలి మొక్కులు చాదర్ సమర్పించిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సలీం, జమాల్, జానీ, హబీబ్, మున్నా, ఖాజా మొయినుద్దీన్, జహంగీర్, నిరంజన్, షబ్బీర్  మరియు ముస్లిం యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు