కొత్తకోటలో కొనసాగుతున్న పట్టణ ప్రగతి

కొత్తకోట,జనంసాక్షి,జూన్13, కొత్తకోట మున్సిపాలిటీ 15వ వార్డులో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం 11వ రోజు ముమ్మరంగా కొనసాగుతుంది.వార్డులో 10మంది పారిశుద్ధ సిబ్బందిని ఏర్పాటు చేసి మురికి కాలువలు శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించి, రెండు రోజుల క్రితం శుభ్రం చేసి న మురికిని చెత్తను మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు పంపించే కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా పాఠశాలలు పునః ప్రారంభం అయినందున జామే మసీదు ముందుగల బాలికల ప్రాథమిక పాఠశాలలో పారిశుధ్య సిబ్బందిచే పాఠశాలను శుభ్రం చేయడం జరిగింది.వార్డులో గల పడిపోయిన పాత ఇండ్ల ప్లాట్లలో కంపతారు చెట్లు మొలవగా తొలగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఖాజా మైనో ద్దిన్,ఆర్పి అంజుం బెగంలు పాల్గొన్నారు.