కొత్తకోటలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్.,.

                          కొత్తకోట,జనంసాక్షి,జూన్ 9.                కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని 9వ వార్డులో కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్ చైర్మన్ పొగాకు  సుఖేషిని విశ్వేశ్వర్ పాల్గొని పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కొత్తకోట మున్సిపాలిటీ కి ఒక వరమని మున్సిపల్ కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి పారిశుధ్యం పై శ్రద్ధ వహించి సద్వినియోగం చేసుకోవాలని  కోరారు.అనంతరం వివిధ వార్డులలో కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించి పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషిని విశ్వేశ్వర్ గారి వెంట 13వ వార్డు కౌన్సిలర్ రామ్మోహన్ రెడ్డి, ఖాజ మైనోద్దిన్,ఎరుకలి తిరుపతయ్య,కో ఆప్షన్ సభ్యులు వసీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.