కొత్తగా మరో 3,39, 096 మందికి లబ్ది

పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డులు మంజూరు
కొత్త లబ్దిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల
గడపగడపకు కార్యక్రమంలో ప్రజలకు నేరుగా వివరణ
పథకం ప్రారంభంలో సిఎం జగగన్‌ వెల్లడి

అమరావతి,జూలై19(జనంసాక్షి ): అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల విూద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ది చేకూరేలా.. కొత్త లబ్దిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల కార్యక్రమం మంగళవారంచేపట్టారు. ఈ సందర్బంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ గత ప్రభుఏత్వాల లాగా ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు చేయడం లేదని, ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చే పథకాలనే కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రజలు నేరుగా లబ్ది పొందుతున్నారని అన్నారు. అందుకే మిగిలివున్న వారంతా లబ్దిపొందాలనే కొత్తగ ఆపెన్షన్ల, రేషన్‌ కార్డులు అందచేస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అందరికీ సంక్షేమంలో భాగంగా.. తాజాగా మరో 3 లక్షల పది వేల కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం వ్యవహరించింది. కొత్త లబ్దిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ’ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. మరో 3 లక్షలకు పైగా కుటుంబాలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అర్హత ఉన్న ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడదని ఈ సందర్బంగా పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన 3,39, 096 మందికి సంక్షేమ పథకాలతో లబ్ది చేకూరుతుందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈబీసీ నేస్తం కింద మరో 6,965 మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. వైఎస్సార్‌ పింఛన్‌ కానుకకు కొత్తగా 2,99,085 మందిని ఎంపిక చేసినట్లు.. అదే విధంగా కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసినట్లు సీఎం జగన్‌ వెల్లడిరచారు. న్యాయంగా.. అవినీతికి తావులేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా.. పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ
సంకల్పమని సీఎం జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత సంక్షేమ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని సంబంధిత మంత్రులకు, అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. అందుకే గడపగడపకు వెళ్లిన సందర్బంగా తాము చేసిన పనులు చెబుతున్నామని, మరోమారు దీవించాలని కోరుతున్నామని అన్నారు. తమ పార్టీ వారు ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లగలుగుతున్నారని సిఎం జగన్‌ అన్నారు. ప్రజలు కూడా తమను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. గత టిడిపి
లాగా దళారీలకు, సన్మభూమి కమిటీలకు దోచిపెట్టే అవకాశం లేదన్నారు.
“““““““““““`