.కొత్తపథకాుండవు
` కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
దిల్లీ,జూన్5(జనంసాక్షి):ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాను ప్రవేశపెట్టబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో కొవిడ్`19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అభియాన్’ తదితర ప్రత్యేక పథకాకు మాత్రమే నిధు కేటాయింపు ఉంటుందని ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ పథకా పరిధిలోకి రాని ఏ ఖర్చులైనా.. ఆదాయ, వ్యయ విభాగం అనుమతి పొందాని సీతారామన్ స్పష్టం చేశారు. ఇప్పటికే బడ్జెట్ ఆమోదం పొందిన ఇతర పథకాను మార్చి 31,2021 వరకు నిలిపివేస్తున్నట్లు మంత్రి వివరించారు. అంతేకాకుండా కొత్త పథకాకు నిధు కేటాయించాంటూ విజ్ఞప్తు పంపొద్దని ఇతర మంత్రిత్వ శాఖకు ఆర్థికశాఖ స్పష్టం చేసింది.ప్రస్తుతం 2,26,770 కరోనా కేసుతో భారత్ ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. ఇక మరణా సంఖ్యలో 12వ స్థానంలో, యాక్టివ్ కేసు విషయంలో ఐదో స్థానంలో కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి కోసం దీర్ఘకాం కొనసాగుతున్న లాక్డౌన్ ప్రభావంతో.. ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. వివిధ రాష్ట్రప్రభుత్వాు కూడా ఖర్చుపై కోతు విధిస్తున్నాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. పరిమితంగా ఉన్న వనరును మారుతున్న ప్రాధాన్యాకు అనుగుణంగా విచక్షణతో వినియోగించాల్సి ఉంటుందని ఆర్థికశాఖ నేటి ప్రకటనలో తెలిపింది.