కొద్దిసేపట్లో బీజేపీ అగ్రనేతలతో మోడీ భేటీ..

ఢిల్లీ: కాసేపట్లో బీజేపీ అగ్రనేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, నితన్ గడ్కరీ తదితరులు హాజరుకానున్నారు. పలు కీలక బిల్లుల ఆమోదంకు అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నట్లు సమాచారం.