కోడేరు మండల కేంద్రంలో సిపిఐఎం మండల స్థాయిశిక్షణ తరగతులు.

 

శిక్షణ తరగతులకు హాజరైన రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్,. రాములు.

కోడేరు (జనం సాక్షి) జూలై 24 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల కేంద్రము లో సిపిఐఎం మండల స్థాయి శిక్షణ తరగతుల సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని వృద్ధులకు పెన్షన్స్ వికలాంగులకు పెన్షన్స్ వితంతు పింఛన్లను ఇవ్వాలని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఋణ మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా మనమందరం ఐక్యంగా పోరాటం చేయాలని వారు కోరారు.మతోన్మాదానికి వ్యతిరేకంగా మనమందరం ఐక్యంగా పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కిల్లె గోపాల్, రాములు నాగర్ కర్నూల్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి పి నరసింహ, మండల నాయకులు ఎం బుచ్చన్న, శ్రీనివాసులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.