కోనసీమ ముంపు ప్రాంతాల్లో మంత్రిపర్యటన

బాధితులకు నిత్యావసరాలు అందించిన వేణుగోపాలకృష్ణ

కోనసీమ,జూలై14(జనం సాక్షి ): గోదావరి ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టింది. బాధితులకు నిత్యావసరసరుకులను పంపిణీ చేసింది. అలాగే వారికి అండగాఉంటామని హావిూని ఇచ్చింది. కోటిపల్లిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ స్వయంగా పడవలో వెళ్లి బాధితులకు బియ్యం, కందిపప్పును అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అత్యవసర మందులు, తాగునీరు, కిరోసిన్‌ అందుబాటులో ఉంచామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు అందిస్తున్నామని మంత్రి వేణు పేర్కొన్నారు. గౌతవిూ గోదావరి వరద తీవ్రతతో రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో కే గంగవరం మండలంలో పలు లంకలు, కోటిపల్లి ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. లంకలతో పాటు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ఇళ్ల మధ్యకు వరద నీరు చేరుకోవడంతో పడవలపైన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఆరడుగుల మేర వరద నీరు నిలిచిపోవడంతో పాటు సవిూపంలోనే గౌతమి గోదావరి ఉండటంతో మరో రెండు మూడు రోజులు పాటు ఇబ్బందులు తప్పేలా లేవని స్థానికులు చెబుతున్నారు.