క్రాంతికుమార్‌ మృతదేహం భారత్‌కు తరలింపు

వాషింగ్టస్‌: గతవారం న్యూయార్క్‌లో మృతి చెందిన వరంగల్‌ జిల్లా నందిగామకు చెందిన హింజె క్రాంతికుమార్‌ (28) మృతదేహాన్ని బుధవారం సాయంత్రం న్యూజెర్సీ నుంచి భారత్‌ కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అతడి పార్దీవదేహం హైదరాబాద్‌ చేరుకుంది. ఇన్వేజెన్‌ ఫార్మా కంపెనీలో పని చేస్తున్న క్రాంతి కుమార్‌ గత వారం నీమో మంచు తుపాను వల్ల కారుపై పడిన మంచును శుభ్రం చేసే ప్రయత్నంలో గుండెపోటుతో మరణించాడు. నార్త్‌ అమెరికాన్‌ తెలుగు అసోసియేషన్‌ (నాటా) ప్రతినిధులు క్రాంతి మృతదేహన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన  ఏర్పాట్లును పర్యవేక్షించారు. అమెరికాలోని పలు తెలుగు సంఘాలు క్రాంతికుమార్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించాయి.