ఖమ్మం: కార్మికుల విజయోత్సవ సభ
మిర్యాలగూడ అర్బన్ : గ్రామ పంచాయతీ కార్మికులకు పంచాయతీ నిధులనుంచి 30శాతం వేతనాల కింద ఇచ్చే విధానలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికుల డిమాండ్కు అనుగుణంగా 50శాతానికి దానిని పెంచడం పట్ల గ్రామ పంచాయతీ వర్కర్ల డివిజన్ అధ్యక్షుడు ఎన్.శౌరయ్య హర్షం వ్యక్తంచేశారు. శుక్రవారం స్థానికంగా విజయోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడతూ 40రోజులుగా సమస్యల సాధనకు సమ్మె చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వేతనాలు పెంచేందుకు సంబంధిత శాఖ మంత్రి తారకరామారావు సానుకూలంగా స్పందించడంపై సమావేశం హర్షం వ్యక్తంచేస్తూ తీర్మాణించింది. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన కోర్కెలను ఆలస్యంగానైనా గుర్తించి అంగీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.