ఖైదీల మధ్య ఘర్షణ: ఒకరి మృతి

ఢిల్లీ: ఢిల్లీలోని తీహార్ జైలులో రెండు వర్గాలకు చెందిన ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఓ ఖైదీ మృతి చెందాడు. బుధవారం రాత్రి ఐదుగురు ఖైదీలు రవీంద్ర అనే సహచరునిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్టు జైలు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు తెలియదని, విచారణ జరిపిన తరువాత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.