గంగానదిలో కొట్టుకుపోయిన మంత్రి కుమార్తె
లక్నో, మే 10: ఉత్తరప్రదేశ్ మంత్రి షాహిద్ మంజూర్ కుమార్తె అబిదా హసన్ గంగానదిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన ఆదివారం ఉత్తరాఖండ్లోని రిషికేశ్ వద్ద చోటు చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్ సహాయంతో అబిదా కోసం గంగానదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మీరట్లో వైద్య విద్య అభ్యసిస్తున్న అబిదా కళాశాల టూర్లో భాగంగా రిషికేశ్ వెళ్లారు.