గంగాపురం చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో నేడు జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న లక్ష్మారెడ్డి

గంగాపురం చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో నేడు జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న లక్ష్మారెడ్డి

జనం సాక్షి జడ్చర్ల నవంబర్ 09:

గంగాపురం శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆశీస్సులతో, జడ్చర్ల నియోజకవర్గ ప్రజల అభిమానం, వారి దీవెనలతో విజయం సాధిస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ పత్రాలతో ముందుగా గంగాపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.రానున్న ఐదేళ్లలో రైతులు, మహిళలు, పేదలు, యువకులకు మరింత మేలు చేకూరుస్తామని, స్వామి వారి ఆశీస్సులతో ప్రజలకు మరింత అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తామని, లక్ష మెజార్టీ సాధించేందుకు స్వామివారి కృపతో పాటు ప్రజల ఆశీస్సులు తనపై ఉండాలని ప్రార్ధించనని ఆయన తెలిపారు.