గజ్వెల్‌లో దళిత సభకు కాంగ్రెస్‌ సన్నాహాలు

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభమయ్యే రోజే గజ్వేల్‌లో దండోరా సభకు కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 24న గజ్వేల్‌లో హౌసింగ్‌ బోర్డు వద్ద సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లను జిల్లా కాంగ్రెస్‌ నాయకులు పరిశీలిస్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీకి కౌంటర్‌గా ఈ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. గజ్వేల్‌ సభకు ఇన్చార్జ్‌గా మాజీ మంత్రి గీతారెడ్డికి బాధ్యతలు అప్పగించారు.