గడ్డ మల్లయ్య గూడ గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.

వేలంపాటలో లడ్డు దక్కించుకున్న కత్తి రెడ్డి భీమ్ రెడ్డి
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- యాచారం మండల  పరిధిలోని గడ్డ మల్లయ్య గూడ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు చివరి రోజు గ్రామ సర్పంచ్ మల్లేష్  ముఖ్య అతిథిగా పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన లడ్డు వేలం పాటలో 1,18, 139రూపాయలకు లడ్డును కత్తి రెడ్డి భీమ్ రెడ్డి కైవసం చేసుకున్నారు తొమ్మిది రోజులుగా పూజలందుకున్న గణపతి లడ్డును కైవసం చేసుకోవడం తన అదృష్టంగా బావిస్తున్నానని అన్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు
 ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.