గణనాధుని లడ్డును వేలం పాటలో దక్కించుకున్న వార్డు సభ్యులు రాదిక శేఖర్ గౌడ్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి);-యాచారం మండలం లోని నందివన పర్తి గ్రామంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన  గణనాధుని నిమజ్జనం అంగరంగ వైభవంగా సాగింది.  లడ్డు వేలంపాటలో పెద్ద లడ్డును 27,500 రూపాయల కు రెండవ వార్డ్ సభ్యులు ఓరుగంటి రాధిక శేఖర్ గౌడ్ కైవసం చేసుకున్నారు, చిన్న లడ్డును 14,000 రూపాయలకు పోలోజు బ్రహ్మచారి కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలందుకున్న గణపతి లడ్డూ ను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు  ఈ కార్యక్రమంలో  ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.