గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకో వాలి.

వీపనగండ్ల ఆగస్టు 27 (జనంసాక్షి)

గణేష్ నవరాత్రి ఉత్సవాలను మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై రామన్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాలలో వినాయక చవితి జరుపుకునే యువకులు పర్మిషన్ కొరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని తెలిపారు. ఎవరు కూడా వినాయక చందాలంటూ బలవంతపు వసూలు చేయకూడదని స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకోవాలని తెలిపారు. పోలీసుల సలహాలు సూచనలు పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని  ఎస్సై తెలిపారు.