*గణేష్ నిమజ్జనం కొరకు వట్టి వాగు స్థలమును పరిశీలించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు *

మెట్పల్లి టౌన్, సెప్టెంబర్ 08 (జనం సాక్షి) మెట్పల్లి పట్టణంలోని వట్టి వాగు వద్ద శనివారం రోజున జరిగే గణేష్ నిమజ్జనం కొరకు స్థల పరిశీలన పనులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు మాట్లాడుతూ త్వర త్వరగా పనులు పూర్తి చేయాలని గణపతి నిమజ్జనానికి ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని అదేవిధంగా వర్షం పడిన గణనాథుని నిమజ్జనం కు వచ్చే వాహనాలు దిగబడకుండా నాణ్యత గల పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖర రావు సిఐ శ్రీనివాస్ కమిషనర్ సల్వాది సమ్మయ్య ఎస్సై సధాకర్ కౌన్సిలర్ బంగారు కాళ్ళ కిషోర్ కోఆప్షన్ మార్గం గంగాధర్ మున్సిపాలిటీ రాజ్ కుమార్ ఏ ఈ అరుణ్ కుమార్ నాయకులు మున్సిపల్ అధికారులు పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు