*గద్వాలలో 3 గంటలపాటు విద్యుత్తు అంతరాయం*

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 9 (జనం సాక్షి);
గద్వాల శివారులోని నది అగ్రహారం మార్గంలో ఉన్న 33/11 కె వి  విద్యుత్ ఉప కేంద్రంలో 11 కెవి ఫీడర్ టౌన్-4 వర్షం కారణంగా చెట్లు కొమ్ములు వైర్లు కి  తగడం వల్ల విద్యుత్ అంతరాయం కలుగుతుందనీ  అందుకోసం చెట్లు కొమ్ములు తీసేయడం కోసం   శనివారం  ఉదయం 09 గంటల నుండి  12.00 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏ డి ఇ. రమేష్ బాబు తెలిపారు.  కొత్త,పాత హౌసింగ్ బోర్డ్, కే ఎల్ ఐ కాలనీ, అంబేద్కర్ చౌక్, ప్రభుత్వ హాస్పిటల్, ఆర్ డి ఓ ఆఫీస్, కోర్టు ఆఫీస్, స్వాగత్ లాడ్జ్, సెకండ్ రైల్వే గేట్ విద్యుత్ అంతరాయం ఉంటుందనీ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.