గరుడ ,రాజధాని బస్ లో ప్రయాణించే వారికి పది శాతం రాయితీ: డిపో మేనేజర్ శ్రీనివాసరావు

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 03 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంతర్ రాష్ట్ర సర్వీసుల్లో గరుడ రాజధాని ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి 10% రాయితీ కల్పిస్తున్నట్లు మణుగూరు డిపో మేనేజర్ శ్రీనివాసరావు శనివారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్, విజయవాడ ,హైదరాబాద్, బెంగుళూరు వెళ్ళు గరుడ రాజధాని సర్వీసుల్లో ఈ నెలాఖరు వరకు 10% రాయితీ కల్పిస్తున్నట్లు వివరించారు. అలాగే విజయవాడ బెంగళూరుకు వెళ్ళే సర్వీస్ లో 10 శాతం తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగ రాయితీ అనేది శుక్ర ఆదివారాల్లో వర్తించదని మిగతా వారాల్లో వర్తిస్తుంది. ఈ తగ్గింపు నెలాఖరు వరకు వర్తిస్తుందన్నారు. కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.