గవర్నర్ల సదస్సు ప్రారంభం

హాజరైన రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ,జూన్‌4(జ‌నం సాక్షి ): రెండు రోజుల పాటూ జరుగనున్న గవర్నర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న ఈ సదస్సులో రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, కేంద్ర ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ తో పాటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. క్లీన్‌ ఇండియా మిషన్‌ తో పాటూ అంతర్గత భద్రతా వ్యవహారాలు వంటి కీలక అంశాలపై రెండు రోజుల సదస్సులో చర్చించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నరసింహన్‌ హాజరయ్యారు.