గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనే ధ్యేయం

:గరిడేపల్లి మండల కేoద్రంలో  ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా స్వచ్ఛత రన్ స్వచ్ఛత కోసం పరుగు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్  త్రిపురం సీతారాంరెడ్డి   మాట్లాడుతూ గాంధీ కోరిన గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని అందులో భాగంగా స్వచ్ఛత రన్ నిర్వహించి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని  తడి పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ డంపింగ్ యార్డుకు తరలించేందుకు సహకరించి గ్రామాన్ని సంపూర్ణ స్వచ్ఛ గ్రామంగా మార్చుకోవడానికి ప్రజలంతా సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సైదాబీ ,వార్డ్ సభ్యులు కొలిపాక  నారాయణ ,మన్నెం రాంరెడ్డి ,మేకపోతుల శ్రీను,కో ఆప్షన్ సభ్యులు బొంత వెంకటరెడ్డి,గ్రామపంచాయతీ కార్యదర్శి,, ఫీల్డ్ అసిస్టెంట్ ,పాఠశాల ఉపాధ్యాయులు , షేక్ రాజ్ మొహమ్మద్ ,యడవల్లి సైదులు ఏఎన్ఎం ,ఆశ వర్కర్లు, వివో ఏ లు విద్యార్ధిని విద్యార్థులు  గ్రామ ప్రజలు  పాల్గొన్నారు