గాజాసిటీపై ఇజ్రాయల్‌ దాడులు: 11 మంది మృతి

 

గాజాసిటీ, నవంబర్‌ 15,(జనంసాక్షి):

గాజాసిటీపై ఇజ్రాయల్‌ చేసిన విమానదాడిలో గురువారం ముగ్గురు పాలస్తీనా వాసులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు దాడులలో మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. మరో 100 మంది గాయపడ్డారని వైర్యాధికిరులు తెలిపారు. హమాన్‌ పాయుధ విభాగం ఎజీడైన్‌ అల్‌-క్వాస్సమ్‌ బ్రిగేడ్స్‌ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ మరణించినవారు తమ సంస్థ సభ్యులని తెలిపారు. వారు ఒక మోటార్‌బైక్‌ టాక్సీలో వెళుతుండగా దాడిలో మరణించారన్నారు. బుధవారం ఇంజ్రాయల్‌ సైన్యం గాజా పై దాడులు ప్రారంభించింది. ఆ దాడులలో హమాన్‌ ఉన్నత కమాండర్‌ ఒకరుమరణించారు. సుమారు సార్లు ఇజ్రాయలీ విమానాలు దాడులు చేశాయని పాలస్తీనా వాసులు చెబుతున్నారు. ఈ దాడులలో హమాస్‌ ఆపరేషనల్‌ కమాండర్‌ క్వాస్సమ్‌ మరణించారు. ఆయన అంగరక్షకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. తర్వాత మరల విమానదాడులు జరగటంతో ఇద్దరు పిల్లలతో సహామరో గురు మరణించారని హమాస్‌ వైద్యమంత్రి ముఫిద్‌ ముఖాలాలాటి చెప్పారు. గాజా సిటీ షిఫా ఆస్పత్రిలో ఆయన విలేఖరులతో మాట్లాడారు.