గార్లలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

 

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్17(జనంసాక్షి)

విశ్వకర్మ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని శివాలయంలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం గార్ల మండల అధ్యక్షులు రావూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలజ్ఞాని శ్రీ మద్విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి ఆచరణలో అన్ని రకాల కులవృత్తుల నాయకులంతా ఏకమై ఐక్యంగా కులవృత్తుల అభివృద్ధికి పోరాడాలని సత్యనారాయణ అన్నారు. గౌరవ అధ్యక్షులు పానుగంటి రాధాకృష్ణ మాట్లాడుతూ కుల వృత్తిదారులు ఏకమై ఐక్యంగా ఉండాలని దాతల సహాయంతో అతి త్వరలో గార్ల మండలంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నిర్మాణానికి సిద్ధంగా ఉందని దాని నిర్మాణానికి విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ నాయకులు ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణసంఘం మండల ప్రధాన కార్యదర్శి0పోలోజు వెంకన్నా చారి, కోశాధికారి పధిలోజు లక్ష్మణా చారి, ఉపాధ్యక్షులు బైరోజు శ్రీనివాసా చారి, రంగు ఉపేంద్రా చారి, కొండపర్తి గంగరాజు, పోతుగంటి బ్రహ్మచారి, రావూరి ప్రశాంత్, పోలోజు పూర్ణ చారి, రావూరి నాగేంద్రాబు, కలకొండ జ్ఞానేశ్వర చారి, ఎడ్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.