గిరిజన జాతికి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి

రాజాపూర్ జెడ్పిటిసి సభ్యులు మోహన్ నాయక్

గిరిజన జాతిని, ఏఐసీసీ ఆదివాసీ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ని కించపరిచే విధంగా మాట్లాడిన టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని రాజాపూర్ మండల జడ్పిటిసి సభ్యులు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు కాట్రావత్ మోహన్ నాయక్ పేర్కొన్నారు.

శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…

గిరిజన జాతిని అవమాన పరుస్తూ వెయ్యి రూపాయలకు, దారు, మద్యానికి అమ్ముడు పోతారనడం శోచనీయమని, రేవంత్ రెడ్డి వెంటనే గిరిజన జాతికి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

పార్టీలకతీతంగా గిరిజన నాయకులు ఈ విషయాన్ని ఖండించాలని ఆయన గిరిజన నాయకులకు విజ్ఞప్తి చేశారు.

విలేకరుల సమావేశంలో నరేష్ నాయక్, రంజిత్ నాయక్, రామ్ లాల్ నాయక్ తదితరులు ఉన్నారు.