గుంటూరులో అనుమానిత మంకీపాక్స్‌ కేసు

గుంటూరు,జూలై30(జనంసాక్షి): గుంటూరు జిల్లాలో మంకీఫాక్స్‌ అనుమానిత కేసు నమోదయ్యింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. రెండువారాలు గడుస్తున్న దద్దుర్లు దక్కకపోవడంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ బాలుడి నమూనాలను సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆదారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జీజీహెచ్‌ అధికారులు వివరించారు.