గుండెమార్పిడి చేయించుకున్న మహిళకు రూ.25లక్షల ఆర్థికసాయం

ఖమ్మం, మార్చి 29 : హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న కొత్తగూడెం మహిళ పద్మకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. ప్రభుత్వం తరపున రూ.25లక్షల చెక్కును ఎమ్మెల్సీ పూల రవీందర్‌ ఆమెకు అందించారు.