*గుమ్మడం గ్రామ పంచాయతీ రికార్డులని తనిఖీ చేసిన అధికారులు*

పెబ్బేరు జూన్15 ( జనంసాక్షి ): పల్లె ప్రగతి లో భాగంగా బుధవారం డి ఆర్ డి ఓ నరసింహులు, ఎంపీడీవో  ప్రవీణ్ కుమార్ లు పెబ్బేరు మండలంలోని గుమ్మడం గ్రామంను సందర్శించి పల్లె ప్రగతిలో భాగంగా గ్రామం లోని అంతర్గత రోడ్లను, మొక్కలు నాటుటకు గుంతలు తీసే పనిని మరియు గ్రామ పంచాయతీ నందు రికార్డులను పరిశీలించడం జరిగినది. కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.